వైసీపీ ప్లీనరీలో మంత్రి Botsa ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-06-29T19:54:06+05:30 IST

జిల్లాలోని చీపురపల్లి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ప్లీనరీలో మంత్రి Botsa ఆసక్తికర వ్యాఖ్యలు

విజయనగరం:  జిల్లాలోని చీపురపల్లి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరీలో మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa satyanarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం స్థాయిలో పార్టీ శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని... అవి పార్టీకి మంచిది కాదని తెలిపారు. ఎల్లకాలం తానే నాయకుడిని అని అనుకోవడం మంచిదికాదన్నారు. అదృష్టం ఉంటే ఎవరైనా నాయకుడు అవ్వవచ్చని అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలందించడంలో గ్రామ స్థాయి నాయకులు లంచాలడిగితే పార్టీకి చేటన్నారు. నియోజకవర్గంలో కొత్త నీటి బుడగలు వస్తున్నాయని, అవి శాశ్వతం కాదని,  పట్టించుకోవలసిన అవసరం లేదని సూచించారు. నియంత రాజకీయాలు వద్దని, అందరు కలసి నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలని హితవుపలికారు.


టీడీపీ నేత కిమిడి నాగార్జునకు కౌంటర్...

‘‘వయసులో చిన్నవాడివి నియోజకవర్గంపై అవగాహన లేకుండా మాట్లాడొద్దు, ఇది విమర్శకాదు, నేర్చుకో.. మీ అమ్మగారు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఏమి అభివృద్ది చేసారో చెప్పు ముందు’’ అంటూ టీడీపీ ఇన్‌చార్జ్ కిమిడి నాగార్జునకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.  డబ్బు ఇస్తే ఓట్లు వేస్తారని చంద్రబాబు బ్రమపడ్డారని అన్నారు. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడం సమయం వృధా అని పేర్కొన్నారు.


డీఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నా....

డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడేమి పాఠలు చెప్పగలరని ప్రశ్నించారు. ‘‘1998 డీఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నాను.. వయసులు పెరిగిపోయాయి, ఈ వయసులో వారు విద్యార్థులకు పాఠాలు ఏమి చెప్తారు. ఉద్యోగులకు మళ్లీ ట్రైనింగ్ నిర్వహిస్తాం’’ అంటూ బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-06-29T19:54:06+05:30 IST