Minister Buggana: కర్నూలుకు హైకోర్టు రాబోతుంది...
ABN , First Publish Date - 2022-10-07T21:11:30+05:30 IST
కర్నూలులో హైకోర్టు రాబోతుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
కర్నూలు (Kurnool): కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీ (National Law University) ఏర్పాటు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath reddy) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనుమతి వచ్చిన కర్నూలులో హైకోర్టు (High Court) రాబోతుందని అన్నారు. ఓర్వకల్లో మల్లికార్జున రిజర్వాయర్ ఏర్పాటుకు సీఎం జగన్ (CM Jagan)తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు.