ప్రభుత్వంపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ధర్మాన

ABN , First Publish Date - 2022-05-05T19:25:35+05:30 IST

ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

ప్రభుత్వంపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ధర్మాన

శ్రీకాకుళం: ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం కంటే వైసీపీ ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తోందని తెలిపారు. కరోనా కష్టకాలంలో సమర్ధవంతమైన పాలన అందించామన్నారు. రాష్ట్రంలో ఒక్క పౌరుడు ఆకలితో వైద్యం అందక ఇబ్బంది పడలేదని చెప్పారు. చంద్రబాబు తమ ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అని ఎలా అనగలిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిఫార్మ్స్‌లో భాగంగా చెత్త పన్ను వేశామని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో బ్రోకర్లు రాజ్యమేలేవారని మంత్రి వ్యాఖ్యానించారు.


వైసీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. జన్మభూమి కమిటీలు ఎలా అనుసరించేవి ప్రజలకు తెలుసని అన్నారు. అనుభవజ్ఞులైన చంద్రబాబు లూజ్ టాక్ చేయటం భావ్యం కాదని మండిపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో ఏపీ కంటే ధరలు తక్కువగా ఉన్నాయా అని ప్రశ్నించారు. మద్యం బ్రాండ్లు చంద్రబాబు హయాంలో వచ్చినివే అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపులు తగ్గించామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు టీడీపీ పాలనలో ఏమి చేశారో చెప్పగలరా అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. 



Read more