వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2021-07-23T06:24:12+05:30 IST
వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
వరంగల్ రూరల్ కలెక్టరేట్, జూలై 22: ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఈ నెల 24న ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడాలని అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు జన్మదినం సందర్భంగా ఈ నెల 24న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన వృక్షార్చనలో అందరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో గ్రామపంచాయతీల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తున్నందున కొన్ని చోట్ల వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తానని మంత్రి దయాకర్రావు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని, ప్రభుత్వ పరంగా పూర్తిగా సహాయ సహకారాలు చేపట్టడానికి అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు.