ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ ను గెలిపించమని కోరిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2020-11-27T02:00:33+05:30 IST

మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లోని బిక్షు గూడలోజరిగిన కార్య్ క్రమంలో టిల్లు ఆధ్వర్యంలో సుమారు 500 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ ను గెలిపించమని కోరిన  మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్: మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లోని బిక్షు గూడలోజరిగిన కార్య్ క్రమంలో టిల్లు ఆధ్వర్యంలో సుమారు 500 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో పార్టీ అభ్యర్థి ప్రభుదాస్ ను  గెలిపిస్తామని వారు ప్రతినబూనారు. ఇక మీర్ పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లో బిల్డర్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 500 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారు కూడా మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో చేరారు.


పార్టీ అభ్యర్థి ప్రభుదాస్ ను  గెలిపిస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం మీర్ పేట్ హౌసింగ్ బోర్డు చైతన్య నగర్ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కోరిన కోరికను తప్పకుండా ప్రభుదాస్ గెలిచాక తీరుస్తానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.


ఈ సందర్భంగా గౌడ కులస్థులు టీఆర్ఎస్ ను గెలిపిస్తామని మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ లోని అన్నపూర్ణ కాలనీ,శ్రీనివాస కాలనీ లలో గల్లీ గల్లీలో ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభుదాస్ ను గెలిపించాలని కోరారు. 

Updated Date - 2020-11-27T02:00:33+05:30 IST