క్రీడలతోపాటు, చదువులోనూ రాణించాలి:ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2021-03-02T00:07:45+05:30 IST
ఇటీవల జాతీయ స్థాయిలో జనగామలో నిర్వహించిన కుంగ్ ఫూ కరాటే పోటీల్లో ప్రతిభను కనబరచిన పాలకుర్తి ప్రాంతానికి
పాలకుర్తి: ఇటీవల జాతీయ స్థాయిలో జనగామలో నిర్వహించిన కుంగ్ ఫూ కరాటే పోటీల్లో ప్రతిభను కనబరచిన పాలకుర్తి ప్రాంతానికి చెందిన పలువురు క్రీడాకారులను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. తాము పొందిన పతకాలతోపాటు పాలకుర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ముందు కరాటేలో వారి నైపుణ్యాన్నిప్రదర్శించారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన మంత్రి నగదు పారితోషికంతో పాటు సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలతోపాటు, చదువులోనూ రాణించాలని క్రీడాకారులను కోరారు. చదువులో రాణిస్తే, క్రీడా పతకాలు, సర్టిఫికేట్లు భవిష్యత్తు ఉద్యోగాలకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు, కుంగ్ ఫూ కరాటే శిక్షణ ఇస్తున్న గుగ్గిళ్ళ దేవేందర్, అతడి భార్య, కరాటే మాస్టర్, ఇతరులు పాల్గొన్నారు.