బీజేపీ నేతలు తప్పడు మాటలు మాట్లాడుతున్నారు: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-04-22T00:29:45+05:30 IST

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తున్నారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు

బీజేపీ నేతలు తప్పడు మాటలు మాట్లాడుతున్నారు: ఎర్రబెల్లి

జనగామజిల్లా: కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.ప్రజలను మాయ మాటలతో మోసం చేస్తున్నారని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన రాష్ట్రంలో రైస్ మిల్లుల ను సీజ్ చేయాలంటున్నారు.బియ్యం కొనమంటే కొనరు...వడ్లు కొనమని మొండి కేస్తారు..మన రైతులను నూకలు తినమని అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం లక్ష్మక్క పల్లె లో ప్రాథమిక రైతు సహకార సంఘం అధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోసాగు నీరు, మంచినీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల వల్ల పంటలు బాగా పండి, దిగుబడి పెరిగిందన్నారు. సీఎం కెసిఆర్ చొరవ వల్ల రైతులు పండించిన ప్రతి గింజను మన ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది.దేశంలో ఎక్కడా, ఏ ప్రభుత్వం కూడా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదు.పక్క రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయని అన్నారు.4 వేల కోట్ల నష్టం వస్తున్నా, కేసిఆర్ వాటిని భరిస్తూ, కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద...రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.సమస్యలు వస్తే వెంటనే వాటిని పరిష్కరించాలన్నారు.టోకెన్లు ఇవ్వండి. పద్ధతి ప్రకారం, ప్రతి గింజ కొనాలి.ఎవరైనా వచ్చి రెచ్చ గొడితే రెచ్చి పోవద్దని సూచించారు. 

Updated Date - 2022-04-22T00:29:45+05:30 IST