కష్టపడే వాడు ఖచ్చితంగా సుఖపడతాడు: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-12-05T23:43:59+05:30 IST

జీవితంలో కష్టపడి పనిచేసే వాడుతప్పకుండా సుఖపడతాడని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

కష్టపడే వాడు ఖచ్చితంగా సుఖపడతాడు: మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్: జీవితంలో కష్టపడి పనిచేసే వాడుతప్పకుండా సుఖపడతాడని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భక్తి భావం, సేవాభావంతో ప్రజలు జీవనం సాగించాలన్నారు. ఇతరులకు చేసే సాయం ఏనాడైనా మనకు తప్పకుండా తిరిగి సాయం అందుతుందన్నారు.మహబూబాబాద్ జిల్లా పరిధి లోని పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ పట్టణ కేంద్రంలో పాటి మీద అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన కన్నె స్వామి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్ష కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. భక్తి భావం, సేవా దృక్పథంతో ప్రజలు ప్రతి ఒక్కరూ ఉండాలి.ఇతరులకు సేవ చేస్తే, వారి సంతానానికి మంచి జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శివ శర్మ మరియు చకిలేల మణిరాజ్, స్థానిక అయ్యప్ప మాలధారులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-05T23:43:59+05:30 IST