విద్యార్థుల సమస్యను పరిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-03-04T21:39:14+05:30 IST

మనఊరు..మనబడి కార్యక్రమంలో భాగంగా రామరాజుపల్లి వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను విద్యార్థులు కలిసి తమ గ్రామానికి బస్సు సర్వీస్ ను ఏర్పాటు చేయాలని కోరారు

విద్యార్థుల సమస్యను పరిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి

జనగామ:  మనఊరు..మనబడి కార్యక్రమంలో భాగంగా రామరాజుపల్లి వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను విద్యార్థులు కలిసి తమ గ్రామానికి  బస్సు సర్వీస్ ను ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే చర్య తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడమే గాక ఆర్టీసీ అధికారులను ఆదేశించడంతో బస్ సర్వీస్ ను కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి శుక్రవారం రామరాజుపల్లి కి విచ్చేసి బస్ సర్వీస్ ను ప్రారంభించడంతో విద్యార్థుల్లో సంతోషం వెల్లివిరిసింది. స్వయంగా మంత్రితో బస్ఎక్కి కృతజ్ఞతలు తెలిపారు.ఇచ్చిన మాట తప్పేదే లేదని ప్రజలు కూడా సహకరించి విద్యార్థులను ప్రభుత్వ బడులకే పంపాలని, తద్వారా విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యతో పాటు, తల్లిదండ్రులకు ఆర్థికభారం తగ్గుతుందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.

Updated Date - 2022-03-04T21:39:14+05:30 IST