గేట్-2022లో ర్యాంకు సాధించిన విద్యార్ధులకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు

ABN , First Publish Date - 2022-03-19T21:37:18+05:30 IST

గేట్-2022 లో ఆలిండియా టాపర్ గా నిలిచిన వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి సందీప్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు

గేట్-2022లో ర్యాంకు సాధించిన విద్యార్ధులకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు

హనుమకొండ: గేట్-2022 లో ఆలిండియా టాపర్ గా నిలిచిన వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి సందీప్ రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు.గేట్-2022 లో దేశంలోని టాపర్ గా నిలిచిన వరంగల్ విద్యార్థి యంగ్ స్టర్ సందీప్ రెడ్డి అని ఆయన అన్నారు.అదేవిధంగా గేట్-2022 లో మెటలార్జీ  ఇంజనీరింగ్ లో 9వ స్థానం సాధించిన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం లోని చీకటాయపాలెంకు(పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం) చెందిన నిరంజన్ కు కూడా మంత్రి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వీరిద్దరూ ఉన్నత విద్య అభ్యసించి, ఉన్నత  స్థాయికి చేరాలని మంత్రి ఆకాంక్షించారు.

Updated Date - 2022-03-19T21:37:18+05:30 IST