బండి సంజయ్‌కు దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వెయ్యమనండి: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-01-13T18:33:09+05:30 IST

‘బండి సంజయ్‌కు దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వెయ్యమనండి.. ప్రజలే ఉరికించి కొడతారు. అరెస్ట్ చేయిస్తామని ఒకడు.. జైలుకు పంపిస్తామని ఒకడు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు’

బండి సంజయ్‌కు దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వెయ్యమనండి: ఎర్రబెల్లి

హైదరాబాద్: ‘బండి సంజయ్‌కు దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వెయ్యమనండి.. ప్రజలే ఉరికించి కొడతారు. అరెస్ట్ చేయిస్తామని ఒకడు.. జైలుకు పంపిస్తామని ఒకడు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం రైతుల మీద కక్ష సాధింపుతో ఉందన్నారు. ఎరువుల విషయంలో బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం దిగి వచ్చి రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించాలన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏవేవో ప్రగల్బాలు పలికాడన్నారు. కాంగ్రెస్ రైతులకు వ్యతిరేకంగా చేసినప్పుడు రేవంతే విమర్శలు చేశాడని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నాశనం కావటానికి కారణం కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఎడారి కావటానికి కారణం కాంగ్రెస్, బీజేపీలేనన్నారు. రైతులను పక్కదోవ పట్టించవద్దని... దొంగ చట్టాల పేరుతో రైతులను బీజేపీ మోసం చేస్తోందన్నారు. మీ రాష్ట్రాల్లో ఏం చేశారో.. మేము ఏం చేశామో చర్చకు కేటీఆర్ సిద్ధమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా దేశ వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. కేంద్రం రైతు అనుకూల నిర్ణయాలు తీసుకునే వరకూ టీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని ఎర్రబెల్లి తెలిపారు.


 


Updated Date - 2022-01-13T18:33:09+05:30 IST