మేడారం జాతరకు జాతీయస్థాయి గుర్తింపు కోసం ప్రయత్నిస్తాం: మంత్రి Errabelli
ABN , First Publish Date - 2022-02-17T17:32:43+05:30 IST
మేడారం మహాజాతరకు జాతీయ స్థాయి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ములుగు: మేడారం మహాజాతరకు జాతీయ స్థాయి గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం మేడారంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ... మేడారం మహాజాతరపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని తెలిపారు. అమ్మవార్లు గద్దెలపైకి వచ్చిన రోజే ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు కావడం విశేషమన్నారు. అమ్మవార్ల ఆశీర్వాదంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని మొక్కుకున్నానని తెలిపారు. ఈయేడాది జాతరకు భారీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పూజారులు, ఆదివాసి సంఘాలు సహకారం అందిస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.