గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి: మంత్రి Errabelli
ABN , First Publish Date - 2022-07-14T17:23:14+05:30 IST
గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
జనగామ: గోదావరి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao) తెలిపారు. గురువారం స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలలో పర్యటించిన మంత్రి... వరదతో కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు. అనంతరం ఏబీఎన్తో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, అధికారయంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో ఉంచామని తెలిపారు. మరో మూడు రోజుల పాటు వరదల ప్రభావం ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గోదావరి పరివాహక ప్రాంతాల వైపు వెళ్లొద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.