మహబూబాబాద్ అణగదొక్క బడ్డది...ఆ పాపంలో మేము ఉన్నాం: Errabelli
ABN , First Publish Date - 2022-05-10T19:33:18+05:30 IST
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు లేదు, ఇక్కడ అమలయ్యే పథకాలు లేవని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
మహబూబాబాద్: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు లేదు, ఇక్కడ అమలయ్యే పథకాలు లేవని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Errabelli dayakar rao) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... దమ్ముంటే అక్కడ పథకాలు అమలు చేసి ఇక్కడ మాట్లాడాలని సవాల్ విసిరారు. గిరిజన తండాల అభివృద్ధికి వెయ్యికోట్లు ఖర్చుచేస్తామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా అణగదొక్క బడ్డదని, ఆ పాపంలో తాము కూడా ఉన్నామని తెలిపారు. అప్పటి పార్టీలు చెప్పినట్టు నడుచుకోవాల్సివచ్చిందని వివరించారు. పిచ్చికూతలు కూసే కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను తిప్పికొట్టాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.