మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసిన ఎర్రబెల్లిదయాకర్ రావు

ABN , First Publish Date - 2022-03-14T20:16:39+05:30 IST

శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డిని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిశారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసిన ఎర్రబెల్లిదయాకర్ రావు

హైదరాబాద్: శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డిని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలిశారు. ప్రశాంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్ష‌లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్ని పార్టీల వారికి న్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతో పాటు ఎంపీలు రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు కూడా మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు.


మంత్రుల నివాసంలోని ఆయ‌న ఇంటికి వెళ్ళిన మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు,నాయకులు కూడ వేముల‌కు పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌జా ప్ర‌తినిధిగా, మంత్రిగా, అసెంబ్లీ వ్య‌వ‌హారాల నిర్వ‌హ‌ణ‌లోనూ మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్నందుకు అభినందించారు. అలాగే, వేముల ప్ర‌శాంత్ రెడ్డి సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఉండాల‌ని, ప్ర‌జాసేవ చేయాల‌ని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-14T20:16:39+05:30 IST