20న వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన

ABN , First Publish Date - 2022-04-15T20:21:19+05:30 IST

రాష్ట్ర మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఈనెల 20వ తేదీన వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు.

20న వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కేటీఆర్ పర్యటన

వరంగల్: రాష్ట్ర మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు ఈనెల 20వ తేదీన వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈసందర్భంగా ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పలువురు సీనియర్ నాయకులతో పాటు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి రూ.2కోట్ల 10 లక్షలతో చేపట్టిన భద్రకాళి మినీ బండ్ ను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు. 


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరంగల్ అంటేనే భద్రకాళి గుడి..భద్రకాళి గుడి అంటేనే వరంగల్ అనే అభిప్రాయం ఉంటుందని.. అలాంటి భద్రకాళి గుడికి కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సుందరంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీయార్ దేనని కొనియాడారు. దేశ విదేశాలనుంచి వచ్చే  భక్తులు, పర్యాటకులను సైతం ఆకట్టుకునేలా భద్రకాళి బండ్ ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.20న వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన ఈ నెల 20వ తేదీన వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఇక కేటీఆర్ రాక సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. 

Updated Date - 2022-04-15T20:21:19+05:30 IST