ఆందోళన వద్దు..కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం
ABN , First Publish Date - 2022-01-19T00:52:52+05:30 IST
ఆందోళన పడొద్దు.. కొంచెం ధైర్యంగా ఉందాం. మీకు అన్ని విధాలుగా అండగా నేను ఉంటాను. మరీ ఇబ్బందులు అనిపిస్తే, నాకు గానీ, నా వద్ద పని చేసే సిబ్బందికి గానీ ఫోన్ చేయండి.
జనగామ: ఆందోళన పడొద్దు.. కొంచెం ధైర్యంగా ఉందాం. మీకు అన్ని విధాలుగా అండగా నేను ఉంటాను. మరీ ఇబ్బందులు అనిపిస్తే, నాకు గానీ, నా వద్ద పని చేసే సిబ్బందికి గానీ ఫోన్ చేయండి. అంటూ ఒకవైపు కరోనా బాధితుల స్థితిగతులను తెలుసుకుంటూనే, మరోవైపు ప్రజాప్రతినిధులు తిండికి ఇబ్బంది ఉన్నవాళ్లకు సపోర్ట్ చెయ్యండి అంటూ... మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బాధితులకు ధైర్యాన్ని అందించారు. ఒకవైపు బాధితులకు భరోసాని, ధైర్యాన్నినింపుతూ మరోవైపు ప్రజాప్రతినిధులు వారి అదుకోవాలని చెపుతూ వారితో మంత్రి మాట్లాడారు.
తనకు ఈ మధ్యే కరోనా వచ్చిందని, ప్రజలందరి ఆశీర్వాదాలతో తాను కోలుకున్నానని ప్రతి ఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల్లోని కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇందులో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వో లు, సీఐ లు, ఎస్సైలు, డీఎం అండ్ హెచ్ఓ, డాక్టర్లను టెలీకాన్ఫరెన్సులోకి తీసుకుని మంత్రి వారితో మాట్లాడారు. కాగా, వారిలో అనేక మంది మంత్రి తోనూ మాట్లాడారు. వారి యోగ క్షేమాలను, అందుతున్న వైద్యాన్ని, తీసుకుంటున్న జాగ్రత్తలను మంత్రి ఎర్రబెల్లితో పంచుకున్నారు.