వ్యాక్సిన్ విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష : మంత్రి ఈటల

ABN , First Publish Date - 2021-04-22T19:58:26+05:30 IST

తెలంగాణకు వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు.

వ్యాక్సిన్ విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష : మంత్రి ఈటల

హైదరాబాద్: తెలంగాణకు వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. గుజరాత్ తో పోలిస్తే తెలంగాణకు కేటాయించినదెంతో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్తో ప్రపంచం అంతా అల్ల కల్లోలంగా మారిందన్నారు. తెలంగాణ ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని, కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్ వారు డబ్బులు చెల్లించలేని వారిని గాంధీకి పంపుతున్నారని అన్నారు.  బ్లాక్ లో ఆక్సిజన్ సరఫరా చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.


ఆక్సిజన్ పై ఐ ఏ ఎస్ ల బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది.తమిళనాడు తరహాలో మా ఆక్సిజన్ మేమే వాడుకుంటాం అని తెలిపారు అనొచ్చు.కానీ అందరి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అలా లేదని మంత్రి స్పష్టం చేశారు. గాంధీలో కరోనా పేషెంట్లకు అవసరమైన అందుతోందని తెలిపారు. 

Updated Date - 2021-04-22T19:58:26+05:30 IST