ఐదు అంశాలపై మంత్రితో చర్చించాను: ఆర్జీవీ

ABN , First Publish Date - 2022-01-10T22:01:29+05:30 IST

మంత్రి పేర్ని నానితో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ ముగిసింది. సమావేశానంతరం ఆర్జీవీ మీడియాతో ఇరువురి మధ్య ఐదు అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.

ఐదు అంశాలపై మంత్రితో చర్చించాను: ఆర్జీవీ

అమరావతి: మంత్రి పేర్ని నానితో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ ముగిసింది. సమావేశానంతరం ఆర్జీవీ మీడియాతో ఇరువురి మధ్య ఐదు అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. టికెట్ రేట్లపై తొలుత ఆర్జీవీ ప్రస్తావించారు. టికెట్ ధరల తగ్గింపుతో సినిమా రంగం దెబ్బతింటుందని ఆయన తెలిపారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో సినిమా క్వాలిటీకి కూడా దెబ్బ తింటుందని వివరించారు. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. త్వరలో మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నానని ఆర్జీవీ ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా ఆర్జీవీ, మంత్రి పేర్ని నాని మధ్య సినిమా టికెట్ల తగ్గింపుపై సోషల్ మీడియాలో వార్ నడిచింది. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చిద్దామని నాని, వర్మకు సోమవారం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్లే రాంగోపాల్ వర్మ, పేర్ని నానితో సమావేశమయ్యారు. ఆర్జీవీని భారీ బందోబస్తు నడుమ ఎయిర్‌పోర్టు నుంచి పోలీసులు వెలగపూడి సచివాలయానికి తీసుకెళ్లారు. 

Updated Date - 2022-01-10T22:01:29+05:30 IST