కేసీఆర్ ఒక్క పిలుపిస్తే... చౌహన్కు భయం చూపించేవాళ్లం: మంత్రి Gangula
ABN , First Publish Date - 2022-01-08T20:28:22+05:30 IST
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్పై మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్పై మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ఒక్క పిలుపిస్తే భయం అంటే ఏంటో చౌహాన్కు చూపించేవాళ్లమని అన్నారు. ‘‘టీఆర్ఎస్ తలచుకుంటే మీరు విమానం దిగేవారా? తిరిగి ఎక్కేవారా?... దొడ్డి దారిన సీఎం అయిన చౌహాన్కు.. కేసీఆర్తో పోలిక ఉందా?’’ అని ప్రశ్నించారు. బీసీలకు ఏం చేశారో చౌహాన్ చెప్పాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ నుంచి వస్తున్న ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ‘‘మా సీఎంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం’’ అని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు.