బండి సంజయ్ది మూర్ఖపు, దుర్మార్గపు మాటలు: మంత్రి Gangula
ABN , First Publish Date - 2022-06-18T19:55:41+05:30 IST
అగ్నిపథ్ అంశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ది మూర్ఖపు, దుర్మార్గపు మాటలు అని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు.
కరీంనగర్: అగ్నిపథ్ అంశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay)ది మూర్ఖపు, దుర్మార్గపు మాటలు అని మంత్రి గంగుల కమలాకర్(Gangula kamalakar) మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... యువతను రెచ్చగొట్టకుండా బండి సంజయ్ ఆచితూచి మాట్లాడాలని హితవుపలికారు. అగ్నిపథ్ స్కీంను కేంద్రం పునరాలోచించాలని తెలిపారు. ఆందోళనలు జరిగిన రాష్ట్రాల మీద దుమ్మెత్తి పోయడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు జరిగాయని.. దానికి కూడా టీఆర్ఎస్ పార్టీ కారణమా అంటూ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.