Harish Rao: దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..

ABN , First Publish Date - 2022-09-22T20:37:06+05:30 IST

దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Harish Rao: దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ..

మెదక్ జిల్లా (Medak Dist.): 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు తెలంగాణ (Telangana)లో పండుతున్నాయని, దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) వ్యాఖ్యానించారు. గురువారం మెదక్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ హేమలత అధ్యక్షతన కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభమైన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సమావేశానికి హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా భవిష్యత్‌లో మరిన్ని ఫలితాలు పొందుతారన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో.. చివరి గింజ వరకు కొనుగోలు చేశామని చెప్పారు. విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు పంపకుండా కేంద్రం సెస్ వేసిందన్నారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని.. అనాలోచిత నిర్ణయాలతో రైతులను విస్మరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులకు ఆదేశం ఇచ్చినట్లు తెలిపారు. ఖరీఫ్ వడ్ల కొనుగోళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-22T20:37:06+05:30 IST