చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారు: Harish rao
ABN , First Publish Date - 2022-07-04T19:41:30+05:30 IST
తెలంగాణకు ఏం చేస్తామో ఒక్క బీజేపీ నేత చెప్పలేదని మంత్రి హరీష్రావు అన్నారు.
హైదరాబాద్: తెలంగాణకు ఏం చేస్తామో ఒక్క బీజేపీ (BJP) నేత చెప్పలేదని మంత్రి హరీష్రావు (Harish rao) అన్నారు. నిన్నటి బీజేపీ సభపై మంత్రి మాట్లాడుతూ... నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని మరోసారి రుజువైందని విమర్శించారు. చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారన్నారు. 18 రాష్ట్రాల సీఎంలు హైదరాబాద్ వచ్చారని... తమ రాష్ట్రాల్లో తెలంగాణకన్నా అద్భుతమైన పథకాలు ఉన్నాయని ఏ ఒక్క సీఎం అయినా చెప్పారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నీళ్లు వచ్చింది నిజం కాదా?, పండిన పంటే నిదర్శనమని అన్నారు. రూ. లక్ష కోట్ల ధాన్యం కొన్నామని నిన్న ప్రధాని చెప్పారని అయితే రాష్ట్రంలో 2 కోట్ల టన్నుల ధాన్యం అదనంగా పండిందని తెలిపారు. పంజాబ్ తర్వాత ఎక్కువ వరి పండించే రాష్ట్ర మనదేనని కేంద్రమే చెప్పిందన్నారు. గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ బీడు భూముల్లో పారాయని హరీష్రావు వెల్లడించారు.