Medak: వరద పరిస్థితులపై మంత్రి Harish rao సమీక్ష
ABN , First Publish Date - 2022-07-14T17:57:45+05:30 IST
వర్షాలు, వరదలు తాజా పరిస్థితులపై మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
మెదక్: వర్షాలు, వరదలు తాజా పరిస్థితులపై మెదక్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harish rao) సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల సహాయం తీసుకొని సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి హరీష్రావు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.