సిద్ధివినాయక ఆలయంలో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-04-19T13:28:24+05:30 IST

జిల్లాలోని రేజింతల్‌లో గల సిద్ధివినాయక దేవాలయంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సిద్ధివినాయక ఆలయంలో మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పూజలు

సంగారెడ్డి: జిల్లాలోని రేజింతల్‌లో గల సిద్ధివినాయక దేవాలయంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు  మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజని,  స్వయంభూ వియకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభిృద్ధికి మరో రు. 50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎలాంటి విఘ్నాలు ఉన్నా తొలగిపోయి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-19T13:28:24+05:30 IST