యోగా నిత్య జీవితంలో భాగమైంది: మంత్రి Harish rao

ABN , First Publish Date - 2022-06-21T14:21:47+05:30 IST

యోగా(Yoga) నిత్య జీవితంలో భాగమైందని మంత్రి హరీష్ రావు(Harish rao) అన్నారు.

యోగా నిత్య జీవితంలో భాగమైంది: మంత్రి Harish rao

సిద్దిపేట: యోగా (Yoga) నిత్య జీవితంలో భాగమైందని మంత్రి హరీష్ రావు (Harish rao) అన్నారు. సిద్ధిపేటలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కొంత మంది రోగాలు పడ్డాక యోగా చేద్దామని అనుకుంటున్నారని, అలా కాకుండా నిత్యం యోగా చేయడం వాళ్ళ పూర్తి ఆయుష్‌తో నిండు నూరేళ్లు బ్రతుకుతారని తెలిపారు. కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని... అన్నింటికి పరిష్కారం యోగా అని చెప్పుకొచ్చారు. సెల్‌ఫోన్ చూడటానికి సమయం ఉంటుంది కానీ, యోగా చేయడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలు కోసం కోమటి చెరువు వద్ద వాకింగ్ ట్రాక్ అందుబాటులో ఉంచామన్నారు. ప్రపంచం మొత్తం భారత్ దేశం వైపు చూస్తోందని చెప్పారు. ఇంకా కొత్త కొత్త ఆసనాలు తయారు చేయాలని కోరారు. అన్ని ఆస్పత్రులలో గర్భిణిల చేత యోగా ఆసనాలు చేయిస్తున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 

Updated Date - 2022-06-21T14:21:47+05:30 IST