Telangana minister: సిద్దిపేటలో రూ.15 కోట్లతో క్యాత్ లాబ్ గుండె చికిత్సలు
ABN , First Publish Date - 2022-09-16T16:25:49+05:30 IST
రాబోయే రోజుల్లో సిద్దిపేటలో రూ.15కోట్లతో క్యాత్ లాబ్ గుండె చికిత్సలు అందిస్తామని మంత్రి హరీష్రావు తెలిపారు.
సిద్దిపేట: రాబోయే రోజుల్లో సిద్దిపేటలో రూ.15కోట్లతో క్యాత్ లాబ్ గుండె చికిత్సలు అందిస్తామని మంత్రి హరీష్రావు (Harish rao) తెలిపారు. శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జరుగుతున్న మెడ్ ఎక్స్ పో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనను తిలకించారు. అనంతరం హరీష్రావు (Telangana minister) మాట్లాడుతూ... గతంలో వైద్య విద్య కోసం విద్యార్థులు ఉక్రెయిన్, రష్యాకు వెళ్లి చదువుకునే వారన్నారు. వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాల కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. రేడియో థెరపీ సేవలకు అనుగుణంగా క్యాన్సర్ చికిత్స అందిస్తామన్నారు. 900 బెడ్స్ హాస్పిటల్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మూడేళ్ల నుండి కరోనా వల్ల ఎక్కడా మెడ్ ఎక్స్ పో జరగలేదన్నారు. రానున్న రోజుల్లో బి కేటగిరీల్లో లోకల్ రిజ్వేషన్ అమలు చేస్తామని, పీజీ సీట్లను 40 వరకు పెంచుతున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.