TS News: సంగారెడ్డిలో ర్యాలీని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ABN , First Publish Date - 2022-08-13T17:41:16+05:30 IST

సంగారెడ్డిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

TS News: సంగారెడ్డిలో ర్యాలీని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి: సంగారెడ్డిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంత్రి హరీష్ రావు (Harish rao) వజ్రోత్సవాల్లో పాల్గోని ర్యాలీని ప్రారంభించారు. 75 అడుగుల మువ్వెన్నల‌ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువత భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణం త్రివర్ణ పతాకాల మయమైంది. బతుకమ్మలు, బోనాలు, డప్పు‌ వాయిద్యాలతో ర్యాలీలో ‌సందడి నెలకొంది. ఎంపీలు బీబీ పాఠిల్ (BB Patil),  కొత్త ప్రభాకర్ రెడ్డి (Prabhakar reddy), మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ (Chinta prabhakar), డీసీఎంఎస్‌ ఛైర్మన్  శివ కుమార్(Shiva kumar) ర్యాలీలో ‌పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-13T17:41:16+05:30 IST