అసెంబ్లీకి చేరుకున్న మంత్రి హరీష్ రావు
ABN , First Publish Date - 2022-03-07T15:58:04+05:30 IST
ఆర్థిక మంత్రి హరీష్రావు కాసేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు.
హైదరాబాద్: ఆర్థిక మంత్రి హరీష్రావు కాసేపటి క్రితమే అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిల్ చైర్మన్ - స్పీకర్ను మంత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతకు ముందు కోకాపేటలోని నివాసం నుంచి బయలుదేరిన మంత్రి హరీష్రావు ఫిలింనగర్లోని దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకు శాసనసభలో మంత్రి హరీష్, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.