సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా నిర్మల్లో ర్యాలీ
ABN , First Publish Date - 2020-09-26T19:55:37+05:30 IST
నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన నేపధ్యంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా ఆ చట్టానికి సంఘీభావంగా శనివారం నిర్మల్ నియోజక వర్గంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు.
నిర్మల్: నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన నేపధ్యంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా ఆ చట్టానికి సంఘీభావంగా శనివారం నిర్మల్ నియోజక వర్గంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కనకాపూర్ వద్ద ఈ ర్యాలీని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ ప్లెక్సీకి నాయకులు పాలు, పూలతో అభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్కు మద్దతు తెలిపేందుకు కృతజ్ఞతగా అన్ని మండలాల నుంచి రైతులు, పార్టీశ్రేణులు పెద్దయెత్తున తరలి వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈసందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత వస్తుందన్నారు. తెలంగాణలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ శాఖలోని అవినీతిని అంతం చేసేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకు వచ్చినట్టు తెలిపారు.