శ్రీవారికి సాలగ్రామ హారాన్నిసమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు

ABN , First Publish Date - 2021-09-13T19:57:01+05:30 IST

తెలంగాణ రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

శ్రీవారికి సాలగ్రామ హారాన్నిసమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు

తిరుమల: తెలంగాణ రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని  దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి వెండి సాలగ్రామ హారాన్ని సమర్పించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని మంత్రికి దేవాలయ అధికారులు అందజేశారు.అంతకుముందు వారికి  ఆలయం వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. 


అనంతరం మంత్రి  మీడియాతో మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని,కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించినట్లు వెల్లడించారు. విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ...హుజురాబాద్  ఉప ఎన్నికలో టిఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు.

Updated Date - 2021-09-13T19:57:01+05:30 IST