మల్లాది చంద్రశేఖర శాస్త్రి మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం
ABN , First Publish Date - 2022-01-15T21:49:05+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాశ్వత ఆస్థాన పండితుడు, ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి మరణం పట్ల దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాశ్వత ఆస్థాన పండితుడు, ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి మరణం పట్ల దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు సద్గ తులు కలగాలని కోరుకున్నారు. పురాణాలను శాస్త్రబద్ధంగా చెప్తూ ఎందరికో ధర్మమార్గాన్ని చూపించిన పౌరాణికులు అని ఆయన సేవలను కొనియాడారు.