మంత్రి Indrakaranకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల షాక్

ABN , First Publish Date - 2022-06-20T16:53:15+05:30 IST

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు షాకిచ్చారు. నేటి నుంచి నుంచి విద్యార్థులు తరగతులకు హాజరవుతారని మంత్రి ప్రకటించారు.

మంత్రి Indrakaranకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల షాక్

నిర్మల్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran reddy)కి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు షాకిచ్చారు. నేటి నుంచి విద్యార్థులు తరగతులకు హాజరవుతారని మంత్రి ప్రకటించారు. అయితే విద్యార్థులు తరగతులకు హాజరుకాలేదు. ప్రభుత్వం నుంచి  ఆశించిన స్పందన లేదన్న ఆందోళనలో విద్యార్థులు ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన వచ్చేంత వరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు స్పష్టం చేశారు. 


మరోవైపు బాసర ట్రిపుల్ ఐటిలో  విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో డిమాండ్ల  పరిష్కారం కోసం సర్కార్ కసరత్తు ప్రారంభించింది. వీసీ నియమాకం కోసం ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమీటీ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు  వెంటనే యూనిఫామ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులతో భేటి తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లో ప్రకటన జారీ చేయనున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-06-20T16:53:15+05:30 IST