గుస్సాడి ఉత్సవాలకు రూ. 1 కోటి రూపాయల మంజూరు
ABN , First Publish Date - 2021-10-19T02:13:56+05:30 IST
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి సందర్భంగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఆదివాసీ గోండులు జరుపుకునే దండారీ గుస్సాడీ ఉత్సవాలకు ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసింది.
హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీపావళి సందర్భంగా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ఆదివాసీ గోండులు జరుపుకునే దండారీ గుస్సాడీ ఉత్సవాలకు ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసింది. అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి కోటి రూపాయలను మంజూరు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈమేరకు సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వారికి నిధుల మంజూరు ఉత్తర్వులను అందజేశారు.