వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ABN , First Publish Date - 2022-07-09T22:33:09+05:30 IST
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో వాగులు పొంగడం, రోడ్లన్నీ జలయం కావడం, కొన్నిచోట్ల ఇళ్లు నీటమునిగిన సంఘటనలు జరిగాయి. ఈ పరిస్ధితుల్లో అధికారులు సహాయ కార్యక్రమాలు పెద్దయెత్తున చేపట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధేశించారు. అలాగే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాలైన శాస్తి నగర్, శాంతి నగర్, మంచిర్యాల చౌరస్తా, నటరాజ నగర్ , బుధవార్ పేట్, హరిజన వాడ, డాక్టర్స్ లేన్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు.
వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను, నాలాలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్ననేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.