వరద నష్టాన్ని వెంటనే అంచనా వేయాలి: మంత్రి Indrakaran reddy

ABN , First Publish Date - 2022-07-11T20:14:53+05:30 IST

నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) సోమవారం విస్తృతంగా(visit) ప‌ర్యటించారు.

వరద నష్టాన్ని వెంటనే అంచనా వేయాలి: మంత్రి Indrakaran reddy

నిర్మ‌ల్: నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖల మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) సోమవారం విస్తృతంగా(visit) ప‌ర్యటించారు.జోరు వాన‌ను సైతం లెక్క చేకుండా వాగులు, వంక‌లు దాటుతూ వ‌ర‌ద నీరు,బుర‌ద‌లోనే సోమ‌వారం ప‌రిమండ‌ల్, కిష‌న్ రావు పేట్ ముంపు గ్రామాల్లో  ప‌ర్య‌టించారు.కిష‌న్ రావు పేట్ లో గండిప‌డిన చెరువును ప‌రిశీలించారు.ముంపునకు గురైన ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే వారికి భరోసా కల్పించారు.వ‌ర్షాల వ‌ల్ల దెబ్బ‌తిన్న‌ పంట పోలాల‌ను ప‌రిశీలించి రైతుల పరిస్థితిని నేరుగా తెలుసుకున్నమంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌భుత్వం అండగా ఉంటుందని తెలిపారు.


నిర్మ‌ల్ జిల్లాలో స‌గ‌టున  22 సెంటిమీట‌ర్ల భారీ వ‌ర్షం కుర‌వ‌డం వ‌ల్ల ఈ ప్రాంత‌మంతా  అత‌లాకుత‌ల‌మైంద‌న్నారు.చెరువులు, కాలువ‌ల‌కు గండ్లు ప‌డ్డాయని, రోడ్లు దెబ్బ‌తిన్నాయని,విద్యుత్ అంత‌రాయం క‌లిగింద‌ని, పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింద‌ని వివ‌రించారు.జిల్లాలోని ప్రాజెక్ట్లులన్నీ  అన్నినిండుకుండ‌లా మ‌రాయన్నారు. అదేవిధంగా అసాధారణ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి జిల్లా అధికారా యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయం అందిచాలన్నారు. 


భారీ వర్షాలు వరదల వల్ల  జిల్లా వ్యాప్తంగా అపార నష్టం జరిగిందన్నారు. చెరువు కట్టలు తెగిపోవటం, గండ్లు పడటం, రోడ్లు తెగిపోవటం లాంటి సంఘటనలు జరిగాయ‌ని చెప్పారు.  చాలా చోట్ల పంట నష్టం కూడా జరిగిందని ఆ వివరాలు కూడా సేకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా రహదారులు, ఇతర మౌళిక వసతులు, పంటనష్టంపై అంచనా వేసి నివేదిక తయారు చేయాలన్నారు. మంత్రి వెంట జిల్లా క‌లెక్ట‌ర్ ముశ్ర‌ఫ్ అలీ ఫారూఖీ, ఇత‌ర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిదులు ఉన్నారు.

Updated Date - 2022-07-11T20:14:53+05:30 IST