‘కేంద్రం, ఐసీఎంఆర్ నిబంధనల మేరకే ప్రభుత్వం పని చేస్తోంది’

ABN , First Publish Date - 2020-07-07T04:19:27+05:30 IST

కరోనా విషయంలో కేంద్రం, ఐసీఎంఆర్ నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగం, ...

‘కేంద్రం, ఐసీఎంఆర్ నిబంధనల మేరకే ప్రభుత్వం పని చేస్తోంది’

సూర్యాపేట: కరోనా విషయంలో కేంద్రం, ఐసీఎంఆర్ నిబంధనల మేరకే రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగం, కోవిడ్ విషయంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు దేశంలో ఎవరూ తీసుకోలేదన్నారు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రూనాట్ విధానంలో రోజుకూ 20 మందికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. త్వరలో ఆ టెస్టుల కెపాసిటీని పెంచుతామని చెప్పారు. ప్రతీ ఒక్కరినీ హైదరాబాద్ పంపించకుండా మెరుగైన వైద్యం అందించేలా సూర్యాపేటలోనే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే కొన్ని కార్యక్రమాలు హాస్య సన్నివేశాలుగా ఉంటున్నాయన్నారు. విద్యుత్ పై కాంగ్రెస్ ప్రవర్తిస్తున్న తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ బిల్లుల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏరుకునే చిల్లర ప్రయత్నాలు చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. 


Updated Date - 2020-07-07T04:19:27+05:30 IST