Jagadish reddy comments: రాజగోపాల్ రెడ్డి చెప్పే ప్రతీ అక్షరం అబద్ధమే
ABN , First Publish Date - 2022-08-18T16:57:55+05:30 IST
అభివృద్ధి నిధులు రాజగోపాల్ రెడ్డి ఇంటికి వచ్చినందుకే ఆయన రాజీనామా చేశారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
నల్గొండ: అభివృద్ధి నిధులు రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) ఇంటికి వచ్చినందుకే ఆయన రాజీనామా చేశారని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish reddy) అన్నారు. గురువారం ఏబీఎన్తో మంత్రి మాట్లాడుతూ... రాజగోపాల్ రెడ్డి చెప్పే ప్రతీ అక్షరం అబద్ధమే అని... ఆయన వ్యాపారం, కుటుంబంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. నియోజకవర్గ నిధులు, సంక్షేమ పథకాలు సద్వినియోగం చేయకుండా రాష్ట్రంలో అత్యంత బాధ్యతారాహిత్యమైన ఎమ్మెల్యేగా రాజగోపాల్ మిగిలారని విమర్శించారు. పార్టీలో పెద్దగా అసంతృప్తి లేదని... అధికారం అడ్డుపెట్టుకున్న ప్రజావ్యతిరేకులను తాము బయటకు పంపాలనుకున్నామని.. వారే వెళ్లిపోయారని తెలిపారు. బండి సంజయ్ (Bandi sanjay).. తొండి సంజయ్... కేసీఆర్ (CM KCR)కు వ్యతిరేకంగా ఒకే గొంతుతో పని చేసేది కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లే అని స్పష్టం చేశారు. మునుగోడులో ఈ నెల 20న సీఎం కేసీఆర్ (KCR) ప్రజా దీవెన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక (Munugodu bypoll)తో టీఆర్ఎస్ (TRS) రికార్డు సృష్టించబోతోందని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.