తెలంగాణ విషయంలో కేంద్రం క్షుద్ర రాజకీయం: మంత్రి Jagadish reddy
ABN , First Publish Date - 2022-06-02T18:36:38+05:30 IST
తెలంగాణ విషయంలో కేంద్రం క్షుద్ర రాజకీయం చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట: తెలంగాణ విషయంలో కేంద్రం క్షుద్ర రాజకీయం చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish reddy) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల కోసమే ఢిల్లీలో కేంద్రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించిందని విమర్శించారు. ఇన్నాళ్లకు బీజేపీకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గుర్తుకు రావడం ఆశ్చర్య కలిగిస్తున్నా....శుభ పరిణామమే అని అన్నారు. కేసీఆర్ ఢిల్లీకి వస్తున్నాడనే బీజేపీ అగ్ర నాయకత్వం ఉలిక్కిపడి హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. విభజన హామీలు నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరపడం ఒక డ్రామా అని వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్ళ క్రితం తెలంగాణాలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు గుజరాత్లో ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.