కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డ మంత్రి Jagadish reddy

ABN , First Publish Date - 2022-06-03T19:40:25+05:30 IST

బీజేపీ పార్టీపై, పాతబస్తీ ప్రార్ధనల వివాదంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు.

కాంగ్రెస్, బీజేపీపై మండిపడ్డ మంత్రి Jagadish reddy

సూర్యాపేట: బీజేపీ పార్టీపై, పాతబస్తీ ప్రార్ధనల వివాదంపై మంత్రి జగదీష్ రెడ్డి(jagadish reddy) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... దేవుడి పేరు దయ్యాల పేర్లు చెప్పి పబ్బం గడుపుకోవటమే తప్ప కాంగ్రెస్, బీజేపీలకు ప్రజల ఆకలి తెలియదని  విమర్శించారు.  ప్రార్థనల పేర్లతో ప్రశాంత వాతావరణం చెడగొట్టడం తప్ప.. ప్రజల ఎజెండా కోసం పనిచేయని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అని విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్ళుగా ప్రశాంతంగా కలిసిమెలిసి జీవిస్తున్న తెలంగాణా సమాజంలో ఓట్ల కోసం చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఒకరి సంస్కృతిని ఇంకొఒక్కరు గౌరవించుకుని జీవిస్తున్న ప్రజల మధ్య  పార్టీలు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రశాంత వస్థావరణం చెడగొట్టే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ వైఫల్యాలను సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తునందుకే తెలంగాణాకు ఆటంకాలు సృష్టిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 


Updated Date - 2022-06-03T19:40:25+05:30 IST