Jagadish reddy: కేంద్రం చరిత్రను మార్చే కుట్ర చేస్తోంది
ABN , First Publish Date - 2022-09-17T19:14:40+05:30 IST
కేంద్రం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మార్చే కుట్ర చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.
సూర్యాపేట: కేంద్రం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మార్చే కుట్ర చేస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish reddy) విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... పోరాట యోధుల పట్ల కొందరు, గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ (Telangana) ద్రోహుల కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని అన్నారు. 2014కు ముందు తెలంగాణలో ఆఖలి చావులు, దరిద్రాలు తప్పా అభివృద్ధి లేదన్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి జగదీష్ రెడ్డి (Telangana minister) చెప్పుకొచ్చారు.