అంతర్జాతీయ విత్తనాబివృద్ధి సంస్థ చైర్మన్ గా డాక్టర్ కేశవులు

ABN , First Publish Date - 2022-06-23T21:11:18+05:30 IST

అంతర్జాతీయ విత్తనాభివృద్ది సంస్థ (IFTA) అధ్యక్షుడుగా తెలంగాణా విత్తనాభివృద్ది సంస్థ ఎండి గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కేశవులు(doctor kesavulu) నియమితులయ్యారు.

అంతర్జాతీయ విత్తనాబివృద్ధి సంస్థ చైర్మన్ గా డాక్టర్ కేశవులు

హైదరాబాద్: అంతర్జాతీయ విత్తనాభివృద్ది సంస్థ (IFTA) అధ్యక్షుడుగా తెలంగాణా విత్తనాభివృద్ది సంస్థ ఎండి గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కేశవులు(doctor kesavulu) నియమితులయ్యారు.స్వీట్జర్ ల్యాండ్ కేంద్రంగా IFTA ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆయన స్వగ్రామం సూర్యాపేట జిల్లా నాగరం మండల కేంద్రం. అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం పొందిన కేశవులు మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి(jagadish reddy)ని కలిశారు.


ఆసియా ఖండంలోనే మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో IFTA చైర్మన్ గా నియమితులైన డాక్టర్ కేశవులును ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప సిద్ధికి IFTA తోడ్పాటు నందించే విదంగా కేశవులు ముందుకు పోవాలని సూచించారు.

Updated Date - 2022-06-23T21:11:18+05:30 IST