గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జోగి రమేష్
ABN , First Publish Date - 2022-04-16T17:36:18+05:30 IST
ఏపీ సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా వేద మంత్రోచ్చరణ మధ్య మంత్రి జోగి రమేష్ బాధ్యతలు స్వీకరించారు.
అమరావతి: ఏపీ సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా వేద మంత్రోచ్చరణ మధ్య మంత్రి జోగి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 31 లక్షల మందికి ఇల్లు కట్టించే బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచారన్నారు అందరికి గూడు కట్టించాలని, ఆ ఇళ్లల్లో గృహ ప్రవేశం చేయాలి అనేది ముందున్న లక్ష్యమని తెలిపారు. విశాఖపట్నం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కొందరు కోర్ట్లకు వెళ్లారన్నారు. దీనికి సంబంధించి విశాఖలో లక్షమంది పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం ఫైల్పై తొలిసంతకం చేసినట్లు చెప్పారు. ఇంతకు ముందు 90 సిమెంట్ బాగ్లు ఇళ్ల నిర్మాణానికి ఇచ్చారని, ఇకపై 140 బాగ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. శాశ్వతంగా వుండే గృహ నిర్మాణం చేయాలన్నారు. అందరికి ఇల్లు సంతృప్తి స్థాయిలో ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. తనకు అడుగడుగునా అండగా నిలిచిన జిల్లా శాసన సభ్యులు, నియోజక వర్గ ప్రజలకు మంత్రి జోగి రమేష్ ధన్యవాదాలు తెలియజేశారు.