Jogi Ramesh: ఎన్టీఆర్ వర్సిటీపై చర్చ నడుస్తుంది...ఎందుకు కంగారు

ABN , First Publish Date - 2022-09-21T16:40:13+05:30 IST

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళనపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jogi Ramesh: ఎన్టీఆర్ వర్సిటీపై చర్చ నడుస్తుంది...ఎందుకు కంగారు

అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో టీడీపీ సభ్యుల (TDP Leaders) ఆందోళనపై మంత్రి జోగి రమేష్ (Jogi ramesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... ఈరోజు కూడా టీడీపీ సభ్యులు (TDP Leaders) సభను అడ్డుకున్నారని అన్నారు. హెల్త్ యూనివర్సిటీ విషయంపై చర్చ నడుస్తుందని... ఎందుకు కంగారని అన్నారు. ‘‘ఎన్టీఆర్‌పై మీకు అంత చిత్త శుద్ది ఉందా. మీరు అంత మంచి వాళ్లు అయితే ఆయన్ను రాళ్ళతో, చెప్పులతో ఎందుకు కొడతారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా, ఆయన పార్టీని, ఆఫీసును కొళ్ళగొట్టి, కూలగొట్టి  లాక్కోన్నారు. ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంది జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan)కి... చంద్రబాబు (Chandrababu)కు కాదు’’ అని అన్నారు. ఎన్టఆర్(NTR) పేరును జిల్లాకు పెడతానంటూ ఇచ్చిన మాటను జగన్ (Jagan mohan reddy) నిలబెట్టుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఆయన ఆ రంగానికి చేసిన సేవల మూలంగానే పెట్టాల్సి వచ్చిందని మంత్రి జోగి రమేష్ (AP Minister) చెప్పుకొచ్చారు. 

Updated Date - 2022-09-21T16:40:13+05:30 IST