అసెంబ్లీ సాక్షిగా ఆ విషయాన్ని అంగీకరించిన మంత్రి కన్నబాబు

ABN , First Publish Date - 2021-11-23T16:32:41+05:30 IST

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాలు కొనసాగుతున్నాయి. డ్రిప్ ఇరిగేష‌న్ రాయ‌ల‌సీమ‌కు లైఫ్ లైన్ అని మంత్రి క‌న్న‌బాబు పేర్కొన్నారు.

అసెంబ్లీ సాక్షిగా ఆ విషయాన్ని అంగీకరించిన మంత్రి కన్నబాబు

అమ‌రావ‌తి : శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాలు కొనసాగుతున్నాయి. డ్రిప్ ఇరిగేష‌న్ రాయ‌ల‌సీమ‌కు లైఫ్ లైన్ అని మంత్రి క‌న్న‌బాబు పేర్కొన్నారు. డ్రిప్ ఇరిగేష‌న్‌ను కావాల‌నే స్లోడౌన్ చేసిన‌ట్టు మంత్రి క‌న్న‌బాబు అంగీక‌రించారు. రెయిన్ గ‌న్‌లు ఇప్ప‌డు టీడీపీ నాయ‌కుల ఇళ్ళ‌లో ఉన్నాయన్నారు. 2019-20 లో రెండు ల‌క్ష‌ల ఎక‌రాల‌కు డ్రిప్ ఇచ్చామన్నారు. గ‌త ప్ర‌భుత్వం బ‌కాయిలు పెట్ట‌డం మూలంగా సిస్టం స‌రిచేయాల్సి వ‌చ్చిందన్నారు. దీంతో డ్రిప్ ఇరిగేష‌న్‌ను కాస్త స్లోడౌన్ చేశామని అంతేకానీ పథకాన్ని ఆపలేదని కన్నబాబు పేర్కొన్నారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నాట‌కి అడిగిన ప్ర‌తి రైతుకు డ్రిప్ ఇస్తామన్నారు.

Updated Date - 2021-11-23T16:32:41+05:30 IST