అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దు: కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2022-06-21T00:58:50+05:30 IST
కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న అగ్నిపథ్ గురించి యువతలో ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న అగ్నిపథ్ గురించి యువతలో ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. యోగాడే దినోత్సవాలు జరిగే సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను మంత్రి సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్నిపథ్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని అన్నారు.మహీంద్రా వంటి కంపెనీ అగ్నివీర్లకు జాబ్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు.
అగ్ని వీర్లకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు వుంటాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో యోగా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారని తెలిపారు.మైసూర్లో మోదీ.. కోయంబత్తూర్లో రాజ్నాథ్ పాల్గొంటారని చెప్పారు.