AP Minister: గణేష్ మండపాలపై అసత్య ప్రచారాలు
ABN , First Publish Date - 2022-08-29T18:14:44+05:30 IST
గణేష్ మండపాలపై అనవసర అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
అమరావతి: గణేష్ మండపాలపై అనవసర అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Kottu satyanarayana) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఏ మీటింగ్ సమావేశం అయినా మైక్ పర్మిషన్ కోసం వంద రూపాయలు చలనా కట్టాలని... అదే విధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి రూ.500 ఫీజ్ ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియా (Social media) ద్వారా ప్రజల్ని గందరగోళం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. భగవంతుడిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ (AP Minister) ఆగ్రహం వ్యక్తం చేశారు.