త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2021-04-14T21:15:00+05:30 IST

రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లిస్తామని మంత్రి కేటీఆర్

త్వరలో కొత్త రేషన్ కార్డులు: మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్: రాష్ట్రంలోని అర్హులైన పేద ప్రజలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం అన్నిరంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. తెలంగాణ రాక మునుపు, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకోవాలని ఆయన సూచించారు. 


టీడీపీ, కాంగ్రెస్ హయాంలో పెన్షన్ల కోసం యుద్ధం చేసే పరిస్థితి ఉండేదని కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పెన్షన్లిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లిస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. గతంలో ఏప్రిల్, మే నెలల్లో కరెంటు కోతలుండేవని, కానీ తెలంగాణ వచ్చిన తరువాత ఇపుడు 24 గంటల కరెంటుస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 

Updated Date - 2021-04-14T21:15:00+05:30 IST