సెప్టెంబర్ 2న జెండా పండుగ: కేటీఆర్
ABN , First Publish Date - 2021-08-27T19:57:50+05:30 IST
హైదరాబాద్: సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2న జెండా పండుగ కార్యక్రమాలు ఉంటాయని, అదే రోజున ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రారంభించే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని చెప్పారు. సెప్టెంబర్ ఆఖరులోపు గ్రామ , మండల , జిల్లా , రాష్ట్ర స్థాయి కమిటీల నియామకాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో 150 డివిజన్ల కు 150 డివిజన్ కమిటీలు ఉంటాయన్నారు. కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 51 శాతం పైగా అవకాశం ఉంటుందని తెలిపారు. మండల , నియోజకవర్గ కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.