నిరసనలు తప్పవు: మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2021-11-13T21:13:17+05:30 IST
రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో
హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తప్పవని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. చాలా సందర్భాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించలేదనిఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సమస్యలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. కొత్త రాష్ట్రం పేచీలు ఎందుకన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.